English | Telugu

ఇక ఐస్‌క్రీం - 2 కూడా తినొచ్చు


అంచనాలు తారుమారు చేస్తూ ఐస్‌క్రీం సినిమా విజయం సాధించడంతో రాం గోపాల్ వర్మ ఈ సినిమా సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు తెలుస్తోంది. మీడియాతో ఆయనకు జరుగుతున్న వివాదం గురించి, ఐస్‌క్రీం సినిమా మేకింగ్ గురించి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని కూడా అందులో చేర్చారు. ఐస్‌క్రీం సినిమా ఫ్లాప్ అయి నష్టం మిగులుస్తుందని జోష్యం చెప్పిన ప్రొడ్యూసర్ తనంతట తానుగా వచ్చి ఆర్‌జీవీతో ఐస్‌క్రీం-2 సినిమా తీస్తున్నారని ఆయన ఈ ప్రకటనలో తెలిపారు. రెండు లక్షల పన్నెండు వేలు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చెబితే గుండాగిపోతుందని ఆయన ఈ సందర్భంలో పేర్కొన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.