English | Telugu

భ‌య‌పెడుతున్న‌ బాహుబ‌లి

చిత్రసీమ‌లో తాడు పాముగా మారి బుస‌లు కొట్ట‌డానికి, పాము తాడుగా వాడిపోవ‌డానికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్పుడు బాహుబ‌లి కూడా అంతే. ఈ సినిమా కూడా టాలీవుడ్‌ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తోంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా ఈ సినిమా రిలీజ్ విష‌యంలో పిచ్చ క‌న్‌ఫ్చూజ‌న్‌లో ఉన్నాడు. ముందు ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తామ‌న్నారు. కానీ మాట త‌ప్పాడు. మే 15న ఖాయం అన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డింది. అంటే ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళికి అప్పుడే క‌న్‌ఫ్యూజ‌న్ మొద‌లైపోయింద‌న్న‌మాట‌. అస‌లు బాహుబ‌లి సినిమాకి బిజినెస్ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌. ప్ర‌భాస్ - రాజ‌మౌళి సినిమాల‌కు బిజినెస్‌తో ప‌నేంటి? అనుకోవ‌చ్చు. కానీ.. నిర్మాత‌లు భారీ రేట్లు చెబితే బ‌య్య‌ర్లు జ‌డుసుకోక ఏం చేస్తారు? నైజాం రూ.30 కోట్లు అడిగితే కొనే నాధుడెవ‌రు? గుంటూరు, కృష్ణ‌, ఈస్ట్‌, వెస్ట్ ఏ ఏరియా తీసుకొన్నా పాతిక కోట్ల‌కు త‌గ్గ‌డం లేదు. సినిమా ఎంత హిట్ట‌యిపోయినా.. అస‌లు సంపాదించుకోవ‌డం గ‌గ‌నం అయిపోతుంది. అందుకే బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి శాటిలైట్ జ‌ర‌గ‌లేదు. రూ.170 కోట్ల‌ని ఎలా రాబ‌ట్టుకోవాలా అని నిర్మాత‌లు చూస్తున్నారు. ఈ సినిమాకి త‌క్కువ రేట్ల‌కు ఎలా కొట్టేద్దామా అని బ‌య్య‌ర్లు చూస్తున్నారు. దాంతో బేరాలు తెగ‌డం లేదు. అందుకే రిలీజ్ డేటు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్పుడు కొత్త‌గా మే 23 అంటున్నారు. అప్ప‌టికైనా వ‌స్తుందా..?? అనేది డౌటే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.