English | Telugu

'RC 15' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'RC 15'(వర్కింగ్ టైటిల్). రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని త్వరలోనే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది.

రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లీకైన కొన్ని ఫోటోలు ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రానికి 'అధికారి', 'సిటిజన్' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ టైటిల్స్ లో ఒకదానిని ఎంపిక చేస్తారో లేక మరో కొత్త టైటిల్ ని ఖరారు చేస్తారో త్వరలోనే తెలియనుంది.

'RC 15'లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.