English | Telugu

'ఎన్టీఆర్ 30' షూటింగ్ మరింత ఆలస్యం!

'ఎన్టీఆర్ 30' షూటింగ్ ఎప్పుడెప్పుడా మొదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఏవో కారణాల ఆలస్యమవుతూ వస్తుంది. నిజానికి ఫిబ్రవరి 24న మూవీని లాంచ్ చేసి, మార్చి మూడో వారంలో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావించారు. కానీ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారకరత్న మృతితో మూవీ లాంచ్ వాయిదా పడింది. దీంతో మార్చిలోనే మూవీని లాంచ్ చేసి, షూటింగ్ కూడా ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది.

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర అధికారిక ప్రకటన గతేడాది మేలోనే వచ్చినప్పటికీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మార్చిలోనైనా ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని వారు ఆశపడుతుండగా.. ఇప్పుడది ఏప్రిల్ కి వాయిదా పడిందని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో మార్చిలో ఘనంగా ప్రారంభించి, షూటింగ్ ని మాత్రం ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా 'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.