English | Telugu

రవితేజ, సూర్య ఒకే చిత్రంలో

రవితేజ, సూర్య ఒకే చిత్రంలో కలసి నటించనున్నారు. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో మాస్ మహరాజాగా పేరొందిన హీరో రవితేజ త్వరలో ప్రముఖ తమిళ హీరో "గజిని" ఫేం సూర్యతో కలసి నటించబోతున్నాడు. రవితేజ, సూర్య హీరోలుగా నటించబోయే చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ ప్రభు తమిళంలో అజిత్ హీరోగా "గ్యాంబ్లర్" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో నిండి, స్టైలిష్ గా ఉండే సినిమాలు తీయటంలో వెంకట్ ప్రభు అందెవేసిన చెయ్యి అని తమిళ సినీ పరిశ్రమ అంటూంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారు. మరి ఈ ఇద్దరు మాస్ హీరోలు కలసి నటించబోయే ఈ మాస్ మసాలా చిత్రం ప్రేక్షకులను ఇంకెంతగా అలరిస్తుందో వేచి చూడాలి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.