English | Telugu

రష్మిక చేతుల్లో కాంతార భవిష్యత్తు.. భారీ నష్టం తప్పదా..?

ఒక్కోసారి కొన్ని సినిమాల రిజల్ట్ ఇతర చిత్రాలపైనో లేదా ఆ సినిమాలతో సంబంధం లేని స్టార్స్ పైనో ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' భవిష్యత్తు కూడా రష్మికా మందన్న చేతుల్లో ఉందన్న ఆసక్తికర చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది. (Rashmika Mandanna)

నిజానికి కన్నడ భామ రష్మికపై కన్నడ ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు. దానికి కారణం.. 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ టైంలో ఎందరో స్టార్స్ విష్ చేస్తే.. రష్మిక మాత్రం విష్ చేయలేదు. దాంతో ఆమెపై కన్నడ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆమె చేతుల్లోనే 'కాంతార చాప్టర్ 1' భవిష్యత్ ఉందనే చర్చ ఆసక్తికరంగా మారింది. (Kantara Chapter 1)

దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన 'కాంతార చాప్టర్ 1' ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అందులో కన్నడ గ్రాస్ రూ.200 కోట్లు అయితే.. దానికి మించేలా హిందీ గ్రాస్ రూ.200 కోట్లకు పైగా వచ్చింది. మూడో వారంలోనూ హిందీ గడ్డ మీద 'కాంతార' బాగానే రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో రష్మిక రూపంలో 'కాంతార' జోరుకి బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది.

రష్మిక ప్రధాన పోషించిన హిందీ చిత్రం 'థామా' నేడు(అక్టోబర్ 21) థియేటర్లలో అడుగుపెట్టింది. మ్యాడాక్‌ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి 'స్త్రీ-2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో 'థామా'పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తర్వాత ఈ సినిమాకి హిందీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 30 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. (Thamma Movie)

'థామా' సినిమా ఇదే జోరు కొనసాగిస్తే.. 'కాంతార చాప్టర్ 1' హిందీ రన్ ఇక ముగిసినట్లే. అసలు ఇప్పుడు 'థామా' విడుదల కాకపోయినా లేదా పాజిటివ్ టాక్ రాకపోయినా.. హిందీలో 'కాంతార' మరో రూ.30 కోట్ల దాకా రాబట్టేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రష్మిక సినిమా దెబ్బకు హిందీలో కాంతారకు భారీగానే నష్టం జరుగుతోందని అంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.