English | Telugu

గురువారం రామానాయుడు అంత్యక్రియలు

దగ్గుబాటి రామానాయుడు అంత్యక్రియలు గురువారం మద్యాహ్నం మూడు గంటల తర్వాత జరుగుతాయని ఆయన కుమారుడు, ప్రముఖ హీరో వెంకటేష్ చెప్పారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రామానాయుడు స్టూడియోస్ వద్ద ఆయన బౌతిక కాయాన్ని ఉంచుతామని, అభిమానులు అక్కడ సందర్శించి నివాళి అర్పించవచ్చని ఆయన అన్నారు. కాగా రామానాయుడు మరణంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతి సినీ పరిశ్రమకు తరని లోటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రామానాయుడు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.