English | Telugu

దగ్గుబాటి రామానాయుడు కన్నుమూత

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ సోకింది. దానికి ఆయన అప్పట్లో చికిత్స తీసుకుని ఆ వ్యాధి మీద గెలిచారు. అయితే వయసు పెరిగిపోవడంతోపాటు ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడటంతో ఆయన మళ్ళీ చికిత్స పొందుతూ బుధవారం నాడు కన్నుమూశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.