English | Telugu

'భోళా శంకర్' కోసం రంగంలోకి దిగుతున్న గ్లోబల్ స్టార్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ట్రైలర్ ను జూలై 27న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ ట్రైలర్ ను తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. రేపు(జూలై 27) సాయంత్రం 4:05 కి ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

తమిళ సినిమా 'వేదాళం'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్, 'భోళా శంకర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.