English | Telugu

రామ్ చరణ్, వంశీ చిత్రం ఫిబ్రవరి నుండి

రామ్ చరణ్, వంశీ చిత్రం ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు నిర్మించనున్నారు. దర్శకుడు వంశీ అంటే "లేడీస్ టైలర్‍" వంశీ అనో లేక, కృష్ణ వంశీ అనో అనుకునేరు. కాదండీ బాబు ఇతను వంశీ పైడిపల్లి. అంటే గతంలో ప్రభాస్ హీరోగా, దిల్ రాజు నిర్మించిన "మున్నా" చిత్రానికి, యన్ టి ఆర్ హీరోగా నటించిన "బృందావనం" చిత్రానికి దర్శకత్వం వహించాడు.

దర్శకుడిగా ఇది అతనికి మూడవ చిత్రం. ఈ చిత్రాన్ని 2012 ఫిబ్రవరి నెలలో ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ" అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రం కూడా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రెండు చిత్రాలూ రామ్ చరణ్ వరసగా చేస్తాడని తెలిసింది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.