English | Telugu

ఇది రామ్ చరణ్ రేంజ్.. కళ్లుచెదిరే ధరకు 'పెద్ది' ఓటీటీ డీల్..!

ఓటీటీ బిజినెస్ బాగా పడిపోయింది అనేది కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. విడుదలకు దగ్గరవుతున్న సినిమాల ఓటీటీ డీల్స్ కూడా క్లోజ్ అవ్వట్లేదని, కొందరు స్టార్స్ కి సైతం ఈ పరిస్థితి తప్పట్లేదని అంటున్నారు. అలాంటిది వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న 'పెద్ది' (Peddi) మూవీ ఓటీటీ డీల్ అప్పుడే క్లోజ్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందులోని క్రికెట్ షాట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పెద్ది బిజినెస్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.110 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు 9 నెలలకు పైగా సమయముండగానే.. ఇంతటి భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడమనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత చరణ్ నుంచి వచ్చిన 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలు మెప్పించలేకపోయాయి. దాంతో 'పెద్ది'పైనే ఆశలు పెట్టుకున్నాడు. చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' తరహాలో 'పెద్ది' కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. గ్లింప్స్ సైతం ఆ నమ్మకాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు భారీ ఓటీటీ డీల్ ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ అంటే గ్లోబల్ రీచ్ ఉంటుంది. కంటెంట్ బాగుంటే.. 'ఆర్ఆర్ఆర్' బాటలో 'పెద్ది' కూడా పయనించి.. మరోసారి చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.