English | Telugu

మహేష్ తో కాకుండా నానితో చేసుంటే ఆ మూవీ హిట్ అయ్యేది

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar)కాంబోలో 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ '1 నేనొక్కడినే'(1 Nenokkadine). సైకలాజికల్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ మూవీని '14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్' అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది. మహేష్ ఈ మూవీలో 'ఇంటిగ్రేషన్ డిజార్దర్' తో బాధపడే వ్యక్తిగా నటించాడు. అంటే మెదడుకి అన్ని విషయాల్ని గుర్తు పెట్టుకునే సామర్ధ్యం ఉండదు. అటువంటి ఇబ్బంది పడే క్యారక్టర్ లో మహేష్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు, ఎప్పుడు ఏం జరుగుతుందనే విధంగా కథనాలు సాగుతాయి. కాకపోతే పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

రీసెంట్ గా ని 14 రీల్స్ అధినేతలో ఒకరైన 'అనిల్ సుంకర'(Anil Sunkara)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు భారీ స్టార్ డమ్ కలిగి ఉన్న 'మహేష్' ని అభిమానులు,ప్రేక్షకులు 'ఇంటిగ్రేషన్ డిజార్దర్ వ్యక్తిగా విజువల్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ కట్ చూడగానే, ఎక్కడో తేడా కొడుతుందని అనుకున్నాను. ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. మహేష్ తో కాకుండా నాని లాంటి హీరోతో చేసుండాల్సింది. సబ్జెట్ ప్రకారం హీరోకి ఇమేజ్ ఉండకూడదు. నాని హీరోగా అప్పుడప్పుడే నోటెడ్ అవుతున్నాడు. అందుకే నాని తో చేసుంటే సినిమా హిట్ అయ్యేది. ప్రొడ్యూసర్ గా కాకుండా సూపర్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్ గా ఈ విషయాన్నీ చెప్తున్నానని తెలిపాడు.

అప్పట్లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో '1 నేనొక్కడినే' భారతీయ సినిమా చరిత్రలో అత్యధికపాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాలం సైట్ లో నిర్వహించిన సర్వేలో సైతం, ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో నిలిచి తెలుగు సినిమా స్థాయిని పెంచింది, మహేష్ తో 'అనిల్ సుంకర దూకుడు, ఆగడు సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు కూడా నిర్మించాడు. ఏ కే ఎంటర్ టైన్ మెంట్ అనే మరో బ్యానర్ నిర్మాణంలో మహాసముద్రం, భోళా శంకర్, మజాకా వంటి పలు విభిన్నమైన చిత్రాలు నిర్మించాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.