English | Telugu

ఎన్టీఆర్ కాదు.. బుచ్చిబాబు 'పెద్ది'లో రామ్ చరణ్!

'ఉప్పెన'(2021)తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. తన రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తోనే చేయాలని చాలాకాలం ఎదురుచూశాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే తన 30వ సినిమాని కొరటాల శివతో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల 'ఎన్టీఆర్ 30' ఆలస్యమవుతూ వస్తోంది. ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అందుకే బుచ్చిబాబు, రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాని చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తయింది. అలాగే తన 16వ సినిమాని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు చరణ్. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే చరణ్ చేయబోయే 16వ సినిమా అని ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు 'పెద్ది' అనే పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాను రాశాడు. ఇప్పుడు అదే కథను చరణ్ కి వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కి సన్నిహితుడు సతీష్ కిలారు ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారని టాక్. రూ.150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రూపొందనుందని న్యూస్ వినిపిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.