English | Telugu

మారుతి డైరెక్ష‌న్‌లో.. చెర్రీ, బ‌న్నీ

ఔను.. చిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి.... ఇప్పుడో గొప్ప ఆఫ‌ర్ కొట్టేశారు. బ‌న్నీ, చెర్రీల‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నాడు. కాక‌పోతే.. చిన్న క‌రెక్ష‌న్‌. సినిమా కోసం కాదు. ఓ స్కిట్ కోసం. హుద్ హ‌ద్ తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డానికి తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ మేము సైతం అనే ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈనెల 30న హైద‌రాబాద్‌లో ఏకంగా 12 గంట‌ల పాటు టెలీ మార‌థాన్ రూపంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు. అగ్ర క‌థానాయ‌కులు, నాయిక‌లు, హాస్య‌న‌టులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఇలా అంద‌రూ ఏదో ఓ స్కిట్‌లో క‌నిపించ‌బోతున్నారు. మెగా హీరోలు చ‌ర‌ణ్‌, బ‌న్నీలు కూడా ఓ స్కిట్ వేసి వినోదాలు పంచ‌బోతున్నారు. ఈ స్కిట్‌కి సంబంధించిన ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం మారుతి చూసుకొంటున్నారు. మ‌రి మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న స్కిట్ ఎలా ఉంటుందో..?? ఈ స్కిట్ ద్వారా మారుతి త‌న టాలెంట్‌ని మెగా హీరోల ద‌గ్గ‌ర ప్రూవ్ చేసుకోవాల‌నుకొంటున్నాడు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.