English | Telugu

ర‌కుల్‌కి ఎంత పొగ‌రో..?!

ఒక‌ట్రెండు విజ‌యాలు చేతిలో ప‌డ‌గానే, నాలుగైదు ఆఫ‌ర్లు అందుకోగానే హీరోయిన్ల‌కు కాలు నేల‌మీద నిల‌వ‌దు. అనుకోకుండా వ‌చ్చిన క్రేజ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోయి.. ఆకాశంలో విహ‌రిస్తుంటారు. అలాంట‌ప్పుడు కిందున్న‌వాళ్లు ఏం క‌నిపిస్తారు.??? దాంతో అవాకులూ చెవాకులూ పేలిపోతుంటారు. ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్‌సింగ్ ప‌రిస్థితీ అంతే. టాలీవుడ్‌లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది ర‌కుల్ బండి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సినిమాల‌లో ఆఫ‌ర్లు అందుకొని.. టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె క‌ళ్ల‌కు బ‌డా హీరోయిన్లు కూడా ఆనండం లేదు. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తోంది.

ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కంటే సీనియ‌ర్ హీరోయిన్ల‌యిన త్రిష‌, కాజ‌ల్‌, అసిన్‌ల‌ను కాస్త చుల‌క‌న‌గా మాట్లాడి... టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. త్రిష‌, కాజ‌ల్‌ల‌తో త‌న‌ని పోలుస్తున్నార‌ని, అయితే వాళ్లెవ‌రూ బాలీవుడ్‌లో నెగ్గుకు రాలేద‌ని, అలాంటివాళ్ల‌తో పోలిస్తే త‌న‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని క‌ల‌రింగు ఇస్తోంది ర‌కుల్‌. అంతేకాదు.. నిల‌క‌డ‌గా విజ‌యాలు సాధించ‌డం త‌న‌కు హాబీ అయిపోయింద‌ని, ఇన్నింగ్స్ ముగిసిన వాళ్ల‌తో పోలిస్తే తాను త‌ట్టుకోలేన‌ని ప‌రోక్షంగా త‌న సీనియ‌ర్ల‌పై సెటైర్లు వేసింది. ర‌కుల్ దూకుడు చూసి.. మీడియా సైతం ముక్కున వేలేసుకొంటోంది. రెండు మూడు విజ‌యాల‌కే ఇలా పొంగిపోతూ.. త‌న సీనియ‌ర్ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌డం ర‌కుల్ స‌న్నిహితుల్నీ షాక్‌లో ప‌డేసింది.

మీడియా ముందు ఇలా మాట్లాడ‌డం భావ్యం కాద‌ని ర‌కుల్ స‌న్నిహితులు సైతం స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. ఆ మాట‌లూ త‌ల‌కెక్కించుకొనేలా లేదు ఈ అమ్మ‌డు. ఇది పొగ‌ర‌నాలో, లేదంటే పొగ‌రుతో కూడిన ఆహంకారంతో వ‌చ్చిన గ‌ర్వం అనాలో టాలీవుడ్‌కీ అర్థం కావ‌డం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.