English | Telugu

పుష్ప తో మాకు ఎలాంటి సంబంధం లేదంటున్న హీరో  

పలాస సినిమాతో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు రక్షిత్. తాజాగా నరకాసుర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 3 న విడుదల అవుతున్న ఈ సినిమా ఇంకో సినిమాకి పోలిక అని వస్తున్న రూమర్స్ మీద రక్షిత్ స్పందించాడు.

నరకాసుర సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ ని ఆడియెన్స్ కి నరకాసుర కలిగించింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ రీసెంట్ గా కొంత మంది నరకాసుర సినిమా పుష్ప సినిమా లాగ ఉంటుందనే రూమర్స్ వచ్చాయి. కానీ నరకాసుర సినిమా కి పుష్పకి ఎలాంటి పోలిక లేదని వాస్తవానికి పుష్ప మొదటి పార్ట్ సినిమా కంటే ముందే 2020 లోనే మా నరకాసుర సినిమా ప్రారంభం అయ్యింది. కొంత మంది ఆర్టిస్ట్ ల డేట్స్ లు సర్దుబాటుగాక లేటయ్యిన సినిమా ఆ తర్వాత కోవిడ్ వల్ల వాయిదా పడిందని ఆ తర్వాత మా దర్శకుడికి ఆక్సిడెంట్ అయ్యి చేయి కోల్పోవడంతో సినిమా మరింత లేట్ అయ్యి ఇప్పుడు మీ ముందుకు వస్తుందని రక్షిత్ చెప్పాడు.ఒక వేళ న గెటప్ చూసి పుష్ప లాగ ఉంటుందని అనుకుంటున్నారేమో గాని మా సినిమా కి పుష్పకి సంబంధమే లేదని రక్షిత్ చెప్పుకొచ్చాడు.
కాగా నరకాసుర కథ ఆంధ్ర, తమినాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక కాఫీ ఎస్టేట్ ప్రాంతంలో జరగనుంది. సినిమాలో హిజ్రాలకి సంబంధించిన సమస్యని కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది. రక్షిత్ సరసన అపర్ణ జనార్దన్, సంకీర్తన విపిన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ నరకాసుర చిత్రానికి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తుండగా ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్ పై డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.