English | Telugu

చాలా గ్యాప్‌ తర్వాత మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌తో వస్తున్న శివాజీ!

నటుడు శివాజీ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి తరహాలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నేను ఫలానా క్యారెక్టరే చేస్తాను లేదా హీరోగానే నటిస్తాను అనే కండీషన్స్‌ పెట్టుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదిగారు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీ ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శివాజీ ది బాస్‌ అనిపించుకుంటున్న శివాజీ ఇప్పుడు బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనిపించుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాలకు దూరమైన శివాజీ చాలా గ్యాప్‌ తర్వాత 90స్‌ ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ పేరుతో రూపొందిన వెబ్‌ సిరీస్‌లో కథానాయకుడిగా నటించారు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్‌ అనే ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌ను రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విక్టరీ వెంకటేష్‌ రిలీజ్‌ చేశారు.

90వ దశకంలో మధ్య తరగతి కుటుంబాలు ఎలా వుండేవి, వారి స్థితిగతులు ఏమిటి అనేది ఎంతో సహజంగా చూపించారు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ, చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని ఎలా నడిపించాడు అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆదిత్య. అప్పట్లో మిడిల్‌ క్లాస్‌ తండ్రి ఎలా ఉండేవాడో అలాగే శివాజీ కనిపించారు. శివాజీ భార్య వాసుకి నటించింది. ‘తొలిప్రేమ’ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ చెల్లెలుగా నటించిన వాసుకి చాలా గ్యాప్‌ తర్వాత మళ్ళీ ఈ వెబ్‌ సిరీస్‌లో కనిపిస్తోంది. జనవరి 5న ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ అవనుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శివాజీ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌తో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.