English | Telugu
సౌందర్యకు హ్యాట్సాఫ్ చెప్పిన రజనీ
Updated : Mar 10, 2014
రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం "కొచ్చడయాన్". తెలుగులో "విక్రమసింహ". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. తొలి సీడీని రజనీ ఆవిష్కరించి, షారుక్ కి అందజేసారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు 150పై చిలుకు చిత్రాల్లో నటించాను. అయితే చారిత్రక నేపధ్యమున్న చిత్రంలో నటించలేదు. అయితే ఆ లోటు నా కూతురు సౌందర్య ద్వారా భర్తీ అయ్యింది. ఈ సినిమా గురించి మొదట్లో నేను చాలా కంగారుపడ్డాను. ఇలాంటి సినిమాలకు దాదాపు ఐదేళ్ళ సమయం, దాదాపు రూ.700 కోట్ల వరకు అవుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని సౌందర్యను అడిగితే..."లేదు నాన్నా..ఏడాదిన్నరలో చేసేస్తా. నాకు ఆ నమ్మకం ఉంద"ని చెప్పింది. దేశంలో ఎవరు చేయని సాహసం మా అమ్మాయి చేస్తోంది. హ్యాట్సాఫ్. నా కూతుళ్ళు ఇద్దరూ దర్శకత్వం చేస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తున్న నా అల్లుళ్ళకు కృతజ్ఞతలు. సౌందర్య చాలా సినిమాలకు దర్శకత్వం వహించి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈ చిత్రంలోని సాంకేతికతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు" అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కె.బాలచందర్, శంకర్, కె.ఎస్. రవికుమార్, దీపికా పదుకునే, ఏ.ఆర్.రెహమాన్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.