English | Telugu

మెగాస్టార్, సూపర్ స్టార్  కాంబోలో మూవీ..వెల్లడి చేసిన రజనీకాంత్  

వాళ్లిదరు భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారమైన నటులు. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి తన నటనతో భారత దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు. ఆ ఇద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది పెద్ద సంచలనమే అవుతుంది. వాళ్ళిద్దరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక వార్త ఇప్పుడు నిజం అయ్యింది. ఇక అంతే భారతదేశ వ్యాప్తంగా ఆ ఇద్దరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియా మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ లు కలిసి ఒక చిత్రం లో నటించబోతున్నారు. ఈ వార్త ని అధికారకంగా రజనీకాంత్ తన ఎక్స్ వేదికగా వెల్లడి చేసాడు. రజనీకాంత్ ఎప్పుడైతే ఈ వార్తని ప్రకటించాడో ప్రస్తుతం ఆ వార్త టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయ్యింది. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమితాబ్ బచ్చన్ మీద తనకున్న గురువాత్సల్యాన్ని కూడా రజనీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రస్తావించాడు. 33 సంవత్సరాల తర్వాత తన గురువు తో కలిసి నటించబోతున్నానని అలాగే నటనలో నేను రాణించటానికి,నిలదొక్కుకోవడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఒక అద్భుతమైన పర్సనాలిటీ తో పని చెయ్యబోతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందని తన ఎక్స్ వేదికగా చెప్పాడు.

తలైవా తన 170 వ చిత్రాన్ని టి .జె జ్ఞానవేల్ దర్శత్వం లో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో నే అమితాబ్ రజనీ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నాడు. లేటెస్ట్ గా జైలర్ తో రజనీ ఇండియా వ్యాప్తంగా రికార్డు లు క్రియేట్ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు అమితాబ్ తో కలిసి రజనీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. రజనీ అండ్ అమితాబ్ లు హం,అందా కనున్, గెరాఫ్తార్ అనే మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలు కూడా 1983 ,85 ,91 సంవత్సరాల్లో వచ్చాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.