English | Telugu

రాజ‌శేఖ‌ర్ బాంబు పేల్చ‌నున్నాడా?

రాజ‌శేఖ‌ర్ భ‌లే మాట‌కారి. ఉన్న‌ది ఉన్న‌ట్టు స్వ‌చ్ఛంగా మాట్లాడేస్తారు. ఆయ‌న తెలుగు యాస‌, గుండెల్లోతుల్లోంచి మాట్లాడే విధానం అంద‌రికీ న‌చ్చుతుంది. సినీ జీవితంలో ఆయ‌న ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. హిట్స్‌, అట్ట‌ర్ ఫ్లాప్స్‌... ఇలా అన్నీ చూశారు. అందుకే.. ప‌రిస్థితుల‌కు ధీటుగా స్పందించ‌డం, ఎలాంటి క్లిష్ట‌మైన స్థితి నుంచైనా బ‌య‌ట‌కు రావ‌డం అల‌వాటు చేసుకొన్నారు. ఇటీవ‌ల ఆయ‌న జీవితంలో భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ట‌. అవేంటో త్వ‌ర‌లో చెబుతా అంటున్నారు.. ''మొన్న విశాఖ‌కు హుద్ హుద్ వ‌చ్చింది. దానికంటే పెద్ద హుద్ హుద్ నా జీవితానికి వ‌చ్చింది. అదేంటో ఇప్పుడు చెప్ప‌ను. 'గడ్డం గ్యాంగ్‌' విడుద‌ల‌య్యాక మాట్లాడుకొందాం'' అంటున్నారాయ‌న‌. మ‌రి రాజ‌శేఖ‌ర్ ఎదుర్కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితులేంటో.. ?? ఆయ‌న జీవితం గురించి చెప్తారా, లేదంటే.... కొంత‌మంది సినీ పెద్ద‌ల్ని టార్గెట్ చేస్తూ ఏదైనా సంచ‌ల‌న విష‌యాలు మాట్లాడ‌తారా? రాజ‌శేఖ‌ర్ ఏం చెబుతారు? ఆయ‌న పేల్చ‌బోయే బాంబు కెపాసిటీ ఎంత‌? అనే విష‌యాల గురించి చిత్ర‌సీమ‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. చిరు ఫ్యామిలీకీ, రాజ‌శేఖ‌ర్‌కీ కోల్డ్ వార్ జ‌రుగుతోంది అనేది అంద‌రికీ తెలిసిందే. ఈ బాంబు కూడా చిరుపైనేనా...?? అన్న‌ది తేలాల్సివుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.