English | Telugu

‘రాజా సాబ్‌’కి సంబంధించి ఒకటి కాదు, రెండు రాబోతున్నాయి.. ఏమిటవి?

టాలీవుడ్‌ టాప్‌ హీరోలంతా ఒక్కొక్కరు తమ సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ థియేటర్లలోకి వచ్చేసి సందడి చేస్తోంది. ఇక రాబోయే సినిమాల్లో ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజాసాబ్‌’పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మొదట ఈ సినిమాను డిసెంబర్‌ 5న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి వాయిదా వేశారు.

త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు. ట్రైలర్‌ ఒక రేంజ్‌లో ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ ట్రైలర్‌ను కట్‌ చేసేందుకు ముంబై నుంచి ఒక స్పెషల్‌ టీమ్‌ హైదరాబాద్‌ వచ్చింది. అయితే ఇక్కడి ప్రేక్షకులకు ముంబై టీమ్‌ మ్యాచ్‌ అయ్యేలా ట్రైలర్‌ కట్‌ చేస్తుందా అనే సందేహంతో ఫైనల్‌గా ఇక్కడి వారితోనే ఆ ట్రైలర్‌ను చేయించారు.

వచ్చేవారం ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. అక్టోబర్‌ 2న కాంతార చాప్టర్‌1 రిలీజ్‌ కాబోతోంది. రాజాసాబ్‌ ట్రైలర్‌ను ఈ సినిమాకి ఎటాచ్‌ చేస్తారని తెలుస్తోంది. కాంతార చాప్టర్‌ 1 కూడా పాన్‌ ఇండియా మూవీ కావడంతో రాజాసాబ్‌ ట్రైలర్‌ అందరికీ రీచ్‌ అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. రాజా సాబ్‌ సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైమ్‌ ఉంది. ఇప్పుడే ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తే టూ ఎర్లీ అవుతుందన్న ఆలోచన కూడా టీమ్‌కి ఉంది. అందుకే సినిమా రిలీజ్‌ టైమ్‌కి మరో ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తారట. అందుకే ఇప్పుడే రెండు ట్రైలర్స్‌ను కట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు రాజాసాబ్‌కి సంబంధించి వచ్చిన అప్‌డేట్స్‌ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ భారీగా పెంచుతున్నాయి. అక్టోబర్‌ 2న విడుదల కానున్న మొదటి ట్రైలర్‌ ఎలాంటి బజ్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.