English | Telugu

రేసుగుర్రం ఆడియో లీకయ్యిందోచ్

ఈ మధ్య సినిమా విడుదలకు ముందే పైరసీ అవుతున్నాయి. అయితే తాజాగా "రేసుగుర్రం" పాటలు కూడా లీక్ అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ అంతకుముందే ఈ సినిమాలోని అన్ని పాటలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. తమన్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే తమిళంలో శింబు నటిస్తున్న "వాలు" చిత్రంలోని పాటలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ ఆడియోను ఎవరు లీక్ చేసారో తెలియదు. ఈ చిత్ర యూనిటే కావాలని ఇలా మార్కెట్లోకి విడుదల చేసిందో లేక ఎవరైనా లీక్ చేసారా అనే విషయం మరికొద్ది క్షణాల్లో తెలియనుంది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్, సలోని కథానాయికలు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.