English | Telugu

సంపత్ రచ్చ బాగా తీస్తున్నాడు- రామ్ చరణ్

"సంపత్ "రచ్చ" బాగా తీస్తున్నాడు" అని రామ్ చరణ్ అంటున్నాడు. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి చిత్రం "చిరుత"కు కూడా మణిశర్మే సంగీతాన్ని అందించారు. ఈ "రచ్చ" చిత్రం గురించి రామ్ చరణ్ తన ట్విట్టర్ లో వ్రాస్తూ "సంపత్ "రచ్చ" చిత్రాన్ని బాగా తీస్తున్నాడు.

సినిమా పట్ల అతనికున్న కమిట్ మెంట్ నాకు బాగ నచ్చింది. ఇక తమన్నా చాలా బాధ్యతగల నటి. ఆమెతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. మణిశర్మ అద్భుతమైన ట్యూన్లు ఇస్తున్నారు. మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయన్న నమ్మకం నాకుంది. ఆ పాటల్లో ఎప్పుడెప్పుడు నటిద్దామా అని ఎదురుచూస్తున్నాను." అని అన్నారు. ప్రస్తుతం "రచ్చ" చిత్రం శ్రీలంకలో హీరో, హీరోయిన్ల మీద పాటను చిత్రీకరించుకుంటోంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.