English | Telugu

ఎన్టీఆర్ 29న డిసైడయ్యాడు..!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ‘కందిరీగ’ ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘రభస’. ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా ఏర్పడిన గందరగోళానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తెరదించారు. ఈ చిత్రాన్ని 29న తప్పకుండా విడుదల చేస్తామని ప్రకటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని అన్నారు. ‘రభస’ ను మొదట ఆగస్ట్ 14న లేదా 15న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల రిలీజ్ ను వాయిదా వేశారు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్ లుగా నటిస్తున్న ఈచిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు.