English | Telugu

పూరి కొడుకు 'ఆంధ్రాపోరి' గొడవేంటి?

ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న ఆంధ్రాపోరి చిత్రం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కొద్ది రోజుల నుంచి ఖమ్మం జిల్లా పాల్వంచలో జరుగుతోంది. ఈ సంధర్బంగా సినిమా యూనిట్ మెంబర్లు అందరూ భద్రాచలం రోడ్‌లోని ఒక హోటల్లో బస చేశారు. అయితే ఒకరోజు అర్ధరాత్రివేళ పాల్వంచ ఎస్.ఐ. షణ్ముఖాచారి ఈ హోటల్‌కి వచ్చాడు. అక్కడ బస చేసిన సినిమా యూనిట్ సభ్యులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పూరి జగన్నాథ్ కొడుకుతో కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ఖమ్మం జిల్లాకు వెళ్ళి అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. దాంతో పోలీసు అధికారులు సదరు ఎస్.ఐ.ని జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆ ఎస్.ఐ. షణ్ముఖాచారి లబోదిబో అంటున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.