English | Telugu

ఎన్టీఆర్ కోసం జగన్ మాస్టర్ ప్లాన్..!

'ఆంధ్రావాలా' అట్టర్‌ఫ్లాప్‌ తరువాతఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లలో ఈ కాంబినేషన్‌లో ఎన్నోసార్లు ఇద్దరూ ప్రయత్నించినా కానీ రెండో సినిమా వర్కవుట్‌ కాలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్‌లో మూవీ వస్తోంది. 'ఆంధ్రావాలా' చిత్ర పరాజయానికి ప్రాయశ్చిత్తంగా మరో సినిమాతో హిట్ ఇస్తానని పూరి అప్పుడే ఎన్టీఆర్‌కి మాటిచ్చాడు. దాని కోసం పూరి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. ఈ మధ్య తాను రాసిన కథలతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయేసరికి..ఇప్పుడు బయట కథతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు పూరి. అలాగే స్క్రిప్ట్ లోని ప్రతి అంశంపైన చాలా శ్రద్ద తీసుకొని మరి రెడీ చేస్తున్నాడట. కమర్షియల్ లెక్కలు వేయడంలో పూరి చాలా సిద్దహస్తుడు. అందుకే ఈసారి ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ నూ కుమ్మెయించడానికి ముందును౦చే రంగం సిద్దం చేస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.