English | Telugu

అగ్రిమెంట్‌ చూపిస్తాం.. ‘ఈగిల్‌’పై తప్పుడు ప్రచారం మానండి!

రవితేజ, కార్తిక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ఈగిల్‌’. అనుపమ పరమేశ్వరన్‌, కావ్వా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్‌ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అబిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో రవితేజ పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. రవితేజ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘ఈగిల్‌’పైనే ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సంక్రాంతికి సినిమా రిలీజ్‌ ఉండదని, సినిమా వాయిదా పడిరదని చెబుతున్నారని చిత్ర యూనిట్‌ మండి పడిరది. ‘ఈగిల్‌’ సినిమా సంక్రాంతికి ఉండదని ప్రచారం చేస్తున్నవారందరికీ గట్టి సమాధానం ఇచ్చింది యూనిట్‌. ఈ ప్రచారం చేస్తున్నవారికి, సినిమా సంక్రాంతికి లేదు అని వార్తలు రాస్తున్నవారికి కావాలంటే థియేటర్‌ అగ్రిమెంట్‌ కూడా చూపిస్తామని మేకర్స్‌ చెబుతున్నారు. సినిమా చాలా బాగా వస్తోందని, తప్పకుండా ‘ఈగిల్‌’ రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని అంటున్నారు. మేకర్స్‌ ఇచ్చిన క్లారిటీతో సినిమా రిలీజ్‌ లేదని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడిరది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.