English | Telugu

నవంబర్‌ 3 నుంచి కొత్త వెర్షన్‌... రికార్డు సృష్టించిన ‘లియో’

విజయ్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకొని రూ.540 కోట్లు కలెక్షన్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా మరోసారి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్లీ ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ప్రేక్షకుల కోరిక మేరకు లియో మేకర్స్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ‘లియో’ చిత్రాన్ని నవంబర్‌ 3న మరోసారి రిలీజ్‌ చెయ్యాలని. ఈ సినిమాకి 15 సెన్సార్‌ కట్స్‌ పడ్డాయి. ఆ కట్స్‌ వల్లే ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. అందుకే ఈ సినిమా అందరూ చూసే విధంగా ఉంది.

ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు నుంచే విజయ్‌ ఒక మాట చెప్తూ వస్తున్నారు. అదేమిటంటే ఈ సినిమాని కట్స్‌ లేకుండా రిలీజ్‌ చేసి ఉంటే బాగుండేది అని. ఫ్యాన్స్‌ కోరికను మన్నించిన మేకర్స్‌ ఎలాంటి సెన్సార్‌ కట్స్‌ లేకుండా ‘లియో’ చిత్రాన్ని విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. నవంబర్‌ 3 నుంచి ఈ సినిమాని సెన్సార్‌ కట్స్‌ లేకుండా ప్రదర్శిస్తారు. అయితే ఈ సినిమాని 18 ఏళ్ళు పైబడినవారు మాత్రమే చూసే అవకాశం ఉంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ‘లియో’ సినిమా మరో అరుదైన రికార్డును క్రియేట్‌ చేసింది. యూకేలో 18 ప్లస్‌ క్లాసిఫికేషన్‌తో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా సెన్సార్‌ కట్స్‌ లేకుండా మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఆల్రెడీ సినిమాను చూసిన వారు కూడా ఈ కొత్త వెర్షన్‌ను చూసేందుకు ఎగబడతారు. దాంతో కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.