English | Telugu

అనుమానాస్పద స్థితిలో నిర్మాత కుటుంబం మృతి


మలయాళ సినీ నిర్మాత సంతోష్ కుమార్ కుటుంబ సమేతంగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. సంతోష్ కుమార్ ఆయన భార్య, కుమార్తెతో కలిసి ఐదేళ్లుగా దుబాయ్ లో నివాసముంటున్నారు. పోయిన గురువారం నుంచి సంతోష్ కుటుంబానికి సంబంధించిన ఎవరూ ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో సమీప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంతోష్ నివాసముంటున్న ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి.కుళ్లిపోయి కనిపించిన వీరి మృతదేహాలపై అనేక కత్తిపోట్లు కనిపిస్తుండగా, దీనిని అక్కడి పోలీసులు మాత్రం ఆత్మహత్యలుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుల బాధ తాళలేక సంతోష్ కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు.


సంతోష్ కుమార్ కేరళలో సౌపర్ణిక ఫిలింస్ నిర్మాణ సంస్థ తో పాటు దుబాయ్ లో ఇతర వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 'మడాంబి' సినిమాకు ఆయన కోప్రొడ్యూసర్. అలాగే మరిన్ని రీమేక్ చిత్రాలు కూడా ఆయన నిర్మించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.