English | Telugu

క్షేత్రంలో ప్రియమణి జేజమ్మే

"క్షేత్రం" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ప్రియమణి జేజమ్మేనంటున్నారు ఆ చిత్రం యూనిట్. వివరాల్లోకి వెళితే గతంలో ప్రముఖ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యాం ప్రసాద రెడ్డి నిర్మించిన "అరుంధతి" చిత్రంలో హీరోయిన్ అనుష్క ధరించిన "జేజెమ్మ" పాత్ర ఎంతటి శక్తివంతమైనదో, ఆ పాత్రలో నటించిన తర్వాత అనుష్కకు ఎంతటి పేరు ప్రఖ్యాతులు లభించాయో అందరికీ తెలిసిందే.


అలాగే "క్షేత్రం" చిత్రంలో కూడా ప్రముఖ హీరోయిన్ ప్రియమణి అటువంటి శక్తివంతమైన పాత్రలోనే నటిస్తుందనీ ఈ "క్షేత్రం" చిత్రం యూనిట్ అంటూంది. ఈ చిత్రంలో ప్రియమణి పాత్ర పేరు "నాగ పెంచలమ్మ" అని తెలిసింది. ఈ చిత్రంలో ప్రియమణి జగపతి బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూంది. ఈ చిత్రంలో జగపతి బాబు వీరనరసింహ రాయలుగా నటిస్తున్నారు. ఈ "క్షేత్రం" సినిమా ఏప్రెల్ ఆరవ తేదీ నుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకోనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.