English | Telugu

పవన్ మరదలు ఒకేసారి పెంచేసింది

"అత్తారింటికి దారేది" సినిమాలో పవన్ మరదలుగా నటించి సినిమా విజయంలో ఓ కీలక పాత్ర వహించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే కన్నడలో ఉపేంద్రతో కలిసి చేసిన "బ్రహ్మ" సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను కోటికి పెంచేసింది. ఇటీవలే ఓ తెలుగు నిర్మాత ఈ అమ్మడిని తమ సినిమాలో నటించాలని ఆఫర్ ఇస్తే... కోటి రూపాయలు ఇస్తే చేస్తాను లేకుంటే చేయనని చెప్పేసిందట. దీంతో ఖంగుతిన్న నిర్మాత వెనక్కి వచ్చేసాడట. ఒకేసారి అటు కన్నడలో, ఇటు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ రావడంతో ఈ అమ్మడు ఇలా పెంచేసి... ఓ నాలుగు కోట్లు వెనకేసుకుందామని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి "రభస" సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమా హిట్టయితే ఈ అమ్మడిని ఆపడం కష్టమే అవుతుంది.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.