English | Telugu

అల్లు అర్జున్ బాటలో ప్రభాస్.. పుష్ప-2 రికార్డు బ్రేక్ అవుతుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab). ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

'రాజా సాబ్' సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు. జూన్ 16న ఉదయం 10.52 నిమిషాలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.

ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో 'రాజా సాబ్'ను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటిస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 5న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది అదే డేట్ కి 'రాజా సాబ్' రానుండటం ఆసక్తికరంగా మారింది. మరి పుష్ప-2 బాటలోనే రాజాసాబ్ కూడా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.