English | Telugu

అనుష్క కోసం రంగంలోకి ప్రభాస్.. నేను ఊరుకోనంటున్నప్రముఖ నటి 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),అనుష్క(Anushka)ఫెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. మిర్చి, బాహుబలి సిరీస్ సక్సెస్ లే అందుకు ఉదాహరణ. సినిమాల పరంగా కాకుండా,వ్యక్తిగతంగా కూడా, ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని ఇద్దరు ఎక్కడ ఖండించలేదు. దీంతో పెళ్లి న్యూస్ పై మరింతగా చర్చ జరుగుతూనే ఉంది.

అనుష్క టైటిల్ రోల్ ని పోషించిన 'ఘాటి'(Ghaati)రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ఘాటి' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ విడుదలైంది. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ లో యాక్షన్ సన్నివేశాలు, అనుష్క రౌద్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో 'వాళ్ళు ఊరుకోరు, వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను' అని అనుష్క చెప్పిన డైలాగ్ అయితే సూపర్ గా ఉంది. ఏ ఉద్దేశ్యంతో 'ఘాటి' తెరకెక్కిందనే విషయాన్నీ కూడా ఆ డైలాగ్ ద్వారా చెప్పించినట్టయ్యింది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పంద ప్రకారం ఘాటి ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనడం లేదు. దీంతో ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఘాటి కి విభిన్న దర్శకుడు 'క్రిష్(Krish)జాగర్లమూడి 'దర్శకత్వం వహించాడు ఇంతకు ముందుకు ఈ ఇద్దరి కాంబోలో వేదం వచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు, జిష్ణు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.