English | Telugu

అభిమానుల్ని టెన్ష‌న్‌లో పెడుతున్న ప్ర‌భాస్‌

బాహుబ‌లి విడుద‌ల ఎప్పుడు? వెండి తెర‌పై ప్ర‌భాస్ విశ్వ‌రూపాన్ని మ‌ళ్లీ చూసేదెప్పుడు? ఇంకెంత కాలం బాహుబ‌లిని చెక్కుతారు? ప్ర‌భాస్ అభిమానుల ముందున్న ప్ర‌శ్న‌లు ఇవే. ఏప్రిల్ లో వ‌స్తుంద‌నుకొన్న బాహుబ‌లి ఆ త‌ర‌వాత మేకు వాయిదా ప‌డింది. తర‌వాత జూన్ అన్నారు. ఇప్పుడు జూన్‌లోనూ బాహుబ‌లి రావ‌డం క‌ష్ట‌మేన‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ ఆల‌స్యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ప‌నులు ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని 50 శాతం సినిమాకి ఇంకా విజువ‌ల్ ఎఫెక్ట్స్ పూర్త‌వ‌లేద‌ని తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో ఈ సినిమా పూర్తికావ‌డానికి ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. బాహుబ‌లి రిలీజ్ డేట్ ఇదీ అని క‌చ్చితంగా ఒక‌టి చెప్పొచ్చుగా అనేది ప్ర‌భాస్ అభిమానుల మాట‌. అస‌లే ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆల‌స్యం చేస్తే.. సినిమాపై అది ప్ర‌తికూల ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రెండేళ్ల పాటు ప్ర‌భాస్ అభిమానులు నీరీక్ష‌ణ‌లో ప‌డిపోయారు. ఇక ఆల‌స్యం చేయ‌లేమంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ఈ సినిమా విడుద‌ల ఎప్పుడ‌నేది ప్ర‌భాస్ చేతుల్లోనూ లేదు. అది రాజ‌మౌళి, విజుల‌వ్ ఎఫెక్ట్స్ నిపుణులూ చూసుకోవాల్సిన విష‌యం. రాజ‌మౌళి మాత్రం ఈ సినిమా విడుద‌ల విష‌యంలో ఏమాత్రం కంగారు ప‌డ‌డం లేదు. అస‌లే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా. రిలీజ్ డేట్ కూడా ప‌క్కాగానే ఉండాలి అనుకొంటున్నారాయ‌న‌. అందుకే ఆల‌స్య‌మైనా.. ఓపిగ్గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మ‌రి ఆ చెక్కుడు కార్య‌క్ర‌మం ఎప్పుడు పూర్త‌వుతుందో రాజ‌మౌళినే చెప్పాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.