English | Telugu

క్రేజ్ కోసం ప్రభాస్, గోపీచంద్‌లు


ప్రస్థానం, గమ్యం లాంటి విభిన్న తరహా చిత్రాలతో నటుడిగా డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్న శర్వానంద్‌ లేటెస్టు చిత్రం "రన్ రాజా రన్''. నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ సినిమాలకు క్రేజ్ తెచ్చిపెట్టెందుకు టాలీవుడ్ హీరోలు ఓ చక్కటి ప్రయత్నం చేశారు. "రన్ రాజా రన్'' ఆడియో ఫంక్షన్‌కి బెస్ట్ బడ్డీస్ ప్రభాస్, గోపిచంద్ గెస్ట్‌లుగా వచ్చారు.


శర్వానంద్, సీరత్ కపూర్ లు హీరోహీరోయిన్లుగు నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు కలిసి నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ నటించిన మిర్చీ చిత్రం బ్యానర్‌ కూడా ఇదే. గోపిచంద్ లేటెస్ట్ చిత్రం కూడా ఈ బ్యానర్ పైనే రూపొందుతోంది. అలా ప్రభాస్‌, గోపీచంద్‌లకు నిర్మాతలతో వున్న రిలేషన్స్ వల్ల కూడా వీరు ఆడియో ఫంక్షన్ లో పాల్గొని వుండవచ్చు అంటున్నారు.

ఏమైనా "రన్ రాజా రన్'' ఆడియో ఫంక్షన్‌కి ఈ ఇద్దరు హీరోలు రావడం వల్ల కొత్త సందడి నెలకొంది. గతంలో శర్వానంద్ చేసిన చిత్రాలకు భిన్నంగా కామెడీ, ప్రేమ అంశాలతో రూపొందిన ఈ చిత్రం శర్వానంద్ కు కొత్త ఇమేజ్‌ని తెస్తుందని ఆశిస్తున్నారు.





పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.