English | Telugu

లెజెండ్ హీరోయిన్‌పై పాకిస్తానీయుల దాడి




రాధిక ఆప్టే పెద్ద గండం నుంచి బయటపడింది. హిందీతో సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తున్న రాధిక ఆప్టే తెలుగు ప్రేక్షకులకు లెడెండ్ సినిమా ద్వారా దగ్గర అయింది. గతంలో రక్త చరిత్రలో కూడా నటించింది.తమిళ చిత్రం షూటంగ్ కోసం యూనిట్ తో సహా కాశ్మీర్‌కు వెళ్లిన రాధికకు ఒక చేదు అనుభవం ఎదురయింది. కాశ్మీర్‌లోని బెహెర్‌గాం, గాబామార్గ్ లో షూటింగ్ నిర్వహిస్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన కొందరు యూనిట్ వాళ్లను ఆటంకపరిచారట. మీరు భారతీయులు ఇక్కడెలా షూటింగ్ నిర్వహిస్తారంటు యూనిట్‌ని బెదిరించడం మొదలుపెట్టారట.కాసేపటి తర్వాత చిత్ర యూనిట్ పైకి వారు కర్రలతో వచ్చి దాడి చేయటం మొదలుపెట్టారట. ఈ దాడి నుంచి రాధిక తృటిలో తప్పించుకుందట.
అంతలో సమీపంలో గల సిక్కులు వచ్చి కాపాడటంతో చిత్ర యూనిట్ మొత్తం ప్రాణాలతో బయటపడ్డారట. భారత సరిహద్దు ప్రాంతంలోనే షూటింగ్ చేస్తున్నప్పటికీ ఇలా దాడి జరగటంపై యూనిట్ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.