English | Telugu

రాజమౌళిని రిజెక్ట్ చేసి బాధపడిన హీరో

బాహుబ‌లి ఆడియో వేడుక‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాజ‌మౌళితో త‌న అనుబంధాన్ని బ‌య‌ట‌పెట్టాడు ప్ర‌భాస్‌. ‘‘కీరవాణిగారు నాకు బెస్ట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. ఆయన తప్ప ఈ సినిమాకి రీరికార్డింగ్‌ వేరేవాళ్లు ఇవ్వలేరు. నన్ను రాజమౌళిగారు స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ టైమ్‌లో కలిస్తే కుదరదు సార్‌ అనేశాను. ఆయన డైరెక్ట్‌ చేసిన స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ అందరికీ నచ్చింది. నాకు పెద్దగా నచ్చలేదు. సింహాద్రి సినిమాకి నేను తారక్‌ పిలిస్తే ప్రివ్యూకి వెళ్లాను. ఆ సినిమా చూడగానే నాకు వండర్‌ అనిపించింది. అరే ఇలాంటి డైరెక్టర్‌కి ఏంటి అలా చెప్పేశాం..ఇక ఆయనతో సినిమాలు చేయడం కుదరదు అనుకున్నాను.

దిల్‌ ఆడియో ఫంక్షన్‌లో మరోసారి రాజమౌళిగారిని కలిసిన సినిమా బాగుందని చెప్పాలంటే తను ఎమనుకుంటాడోనని భయపడ్డాను. అయితే చివరికి సింహాద్రి సినిమా చూశాను..బాగుంది సార్‌..అన్నాను. అప్పటికీ నా వర్షం సినిమా రిలీజ్‌ కాలేదు. త్వరలోనే మనం కలిసి సినిమా చేద్దాం అన్నారు. ఇలాంటి డైరెక్టర్స్‌ కూడా ఉంటారా అనిపించింది. తర్వాత మేం కలిసి ఛత్రపతి సినిమా చేశాం. అప్పుడు ఆయనతో మంచి రిలేషన్‌ ఏర్పడిరది. ఆయన మనస్తత్వమే డిఫరెంట్‌. గ్రేట్‌ సోల్‌..గ్రేట్‌ క్యారెక్టర్‌ ఉన్న వ్యక్తి. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా పర్సనల్‌, ప్రొఫెషనల్‌ సమస్యలన్నీ ఆయనతో పంచుకుంటుంటాను. ఆయన నన్ను తన సోల్‌మేట్‌ అన్నారు. కానీ నాకు ఆయన అంత కంటే ఎక్కువే.

ఆరు సంవత్సరాలకు ముందు నన్ను కలిసి ఓ పెద్ద సినిమా చేద్దామన్నారు. అప్పటికీ మగధీర రిలీజ్‌ కాలేదు. నాకేమో నాలుగు ప్లాప్‌లున్నాయి. మగధీర రిలీజ్‌ అయింది. ఆయనింకా పెద్ద డైరెక్టర్‌ అయిపోయాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో చెబితే రాజమౌళి ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌ నీతో సినిమా ఎందుకు చేస్తాడని అన్నారు. పెద్ద సినిమా అన్నారు కానీ ఇంత పెద్ద సినిమా అని అనుకోలేదు. బాహుబలి వన్స్‌ ఇన్‌ లైఫ్‌ టైమ్‌ మూవీ. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. వారి ఫ్యామిలీతో కలిసి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. జూలై 10న బాహుబలితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అని ప్రభాస్ అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.