English | Telugu

కమెడియన్స్ హీరోయిజం ప్రదర్శించలేరా?

తెరపై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే హాస్యనటుల్లో చాలామంది హీరోయిజాన్ని కూడా ప్రదర్శించారు. ఆంధ్రా దిలీప్ కుమార్ గా పేరుతెచ్చుకున్న చలం నుంచి ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు ప్రధాన ఆకర్షణ అయిన బ్రహ్మానందం వరకూ అంతా హీరోగా మురిపించినవారే. అయితే నవ్వించే నటుడుని హీరోగా ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తున్నారు? ఇప్పటి వరకూ ఒక్క హాస్యనటుడైనా ఫుల్ టైమ్ హీరోగా స్థిరపడ్డాడా? సినిమా విజయంలో భాగం పంచుకున్న హాస్యనటులు హీరోలుగా రాణించలేకపోతున్నారా? నాటి నుంచి ఇదే పంథా నడుస్తోందా ? తెలుగువన్ స్పెషల్ స్టోరీ.

స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటులు చాలామంది... ఆ తరువాత హీరోలుగా మారి ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశారు.... అందులో ఎంతమంది హీరోలుగా కంటిన్యూ అయ్యారన్న విషయాన్ని పక్కనపెడితే... చాలామంది కమెడియన్లు కెరీర్ లో ఎప్పుడో ఒకప్పుడు హీరో అవ్వాలనే కోరికను దాదాపుగా నెరవేర్చుకున్నారు....లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరాడు హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి. గీతాంజలి సినిమాతో హీరోయిన్ ని మౌనంగా ప్రేమించే వ్యక్తిగా ... హీరో కాని హీరోలా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అయితే ఈసారి ఫుల్ టైమ్ హీరోగా నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ హీరోలుగా మురిపించిన, మురిపిస్తున్న కమెడియన్స్ ఎవరో? వాళ్లెంతవరకూ సక్సెస్ అయ్యారో చూద్దాం.

జమానా కాలంలో వచ్చిన గుణసుందరి కథతో హీరోగా అవతారమెత్తాడు హాస్యనటుడు కస్తూరిశివరావు. ఆ సినిమా అద్భు తమైన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆయన హీరోగా కంటే హాస్యనటునిగానే ఎక్కువగా రాణించారు. అదే సమయంలో హాస్య నటుడు రేలంగి...పక్కింటి అమ్మాయి, పెద్దమనుషులులో ప్రధానపాత్రలు పోషించినా అంత గుర్తింపురాలేదు. ఆ తర్వాత రాజబాబు, చలం, పద్మనాభం హీరోలుగా ట్రై చేశారు. రాజ బాబు హీరోగా తాతమనవడు, మనిషి రోడ్డున పడ్డాడు, తిరుపతిలో నటిస్తే..... చలం హీరోగా బుల్లెమ్మ-బుల్లోడు, మట్టిలోమాణిక్యం, బొమ్మా బొరుసా, తోటరాముడు, సంబరాల రాంబాబు లో హీరోగా మెప్పించాడు. అటు పద్మనాభం సైతం హీరోగా పొట్టిప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, జాతకరత్న మిడతంబొట్లులో మెప్పించాడు.



నేటి హాస్యనటుల విషయానికొస్తే ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న సునిల్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందాలరాముడితో హీరోగా మారిన సనిల్ మర్యాదరామన్నతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నా హీరోగా చెప్పుకోదగిన విజయాల్లేవు. మర్యాదరామన్న సైతం రాజమౌళి వల్లే హిట్టైందనేది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా ఎక్కువ కాలం కొనసాగిన కమెడినయ్ల లిస్ట్ లో ఫస్ట్ ఉంటుంది అలీ పేరు. యమలీలతో మెప్పించి ఘటోత్కజుడుతో విజయం సాధించిన అలీ ఆ తర్వాత ఆఫర్లైతే దక్కించుకున్నాడు కానీ ఆ స్థాయిలో హిట్స్ లేవు. వారేవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ అన్న పాటతో ఉత్సాహం తెచ్చకున్న బహ్మానందం సైతం హీరోగా ట్రై చేశాడు. బాబాయ్ హోటల్, జోకర్ మామ-సూపర్ అల్లుడు ఈ మధ్యే జప్ఫా లో హీరోగా కనిపించినా ప్రేక్షకాదరణ పొందలేకపోయాడు.

వేణుమాధవ్(భూకైలాస్‌, ప్రేమాభిషేకం) , కృష్ణ భగవాన్ (జాన్‌ అప్పారావు 40ప్లస్‌, మిస్టర్‌ గిరీశం, దొంగ సచ్చినోళ్ళు) సైతం హీరోలుగా అడుగేసిన వాళ్లే. కానీ ఆరంభంలోనే బోల్తాకొట్టి సైలెంట్ గా కామెడీ తో బండి లాగించేస్తున్నారు. అతిచేసి ఆదరణ సంపాదించుకున్న ధనరాజ్, తాగుబోతు రమేశ్ కూడా ప్రేక్షకులని క్షమించలేదు. ఏకేరావ్ పీకేరావ్ సినిమాతో వీళ్లూ హీరోలైపోయారు. ఎంచక్కా నవ్వించే వెన్నెల కిషోర్ కు సైతం పైత్యం ముదిరి అతడు ఆమె స్కూటర్ తో హీరో అవతారమెత్తాడు. ఆ తర్వాత ఎవరి పని వాళ్లే చెయ్యాలనే అసలు విషయం గ్రహించి మళ్లీ నవ్వించే పనిలో పడ్డారంతా.

ఈ లెక్కన ఇప్పటివరకూ హీరోగా టర్న్ అయిన హాస్యనటుల్లో చలం తప్ప మరెవ్వరూ పూర్తిస్తాయి హీరోలుగా క్లిక్కవలేదు. కారణం హీరో అవ్వాలన్న ఆత్రం తప్ప తాము హీరోయిజం ప్రదర్శించగలమా అని ప్రశ్నించుకోపోవడమే. పైగా హీరోలైన హాస్యనటులు సినిమాల్లో హిట్స్ కన్నా ప్లాపుల శాతమే ఎక్కువ. టాలీవుడ్ తో పాటూ ...ఇతర భాషా చిత్రాల్లోనూ ఇలాగే ఉంది. అయితే రీసెంట్ గా నేనూ ట్రై చేస్తా అంటున్నాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. మిగిలిన వాళ్లకి శ్రీనివాసరెడ్డికి ఉన్న చిన్న తేడా ఏంటంటే..ఇప్పటి వరకూ శ్రీనివాస రెడ్డికి కమెడియన్ గా ఒక్క మైనస్ మార్కు పడలేదు. పైగా సినిమా ఫ్లాప్ అయినా శ్రీనివాసరెడ్డి నటన మాత్రం హాయిగా నవ్వులు పూయించింది. దీంతోపాటూ గీతాంజలిలో హీరో కాని హీరోలా అమాయకంగా నటించి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. మరి ఈ లెక్కన శ్రీనివాసరెడ్డి చలం ని ఆదర్శంగా తీసుకుని జాగ్రత్తగా అడుగేస్తాడో? మిగిలిన వాళ్లలా హీరో అవ్వాలనే ఆత్రంతో మైనస్ మార్కులేయించుకుంటాడా? చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.