English | Telugu

అనుపమ పరమేశ్వరన్ కి భారీ షాక్ !

'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'పరదా'(Paradha).ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న 'పరదా' నిన్న వరల్డ్ వైడ్ గా తెలుగు, మలయాళ భాషల్లో మెజారిటీ స్క్రీన్స్ లో విడుదలైంది. సినిమా బండి, శుభం వంటి విభిన్న చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) తెరకెక్కించాడు. దర్శన రాజేంద్రన్(Darshana Rajendran)గౌతమ్ వాసుదేవ మీనన్, సంగీత, రాగ్ మయూర్, బలగం సుధాకర్ రెడ్డి కీలక పాత్రలు పోషించగా, ఆనంద మీడియా పతాకంపై శ్రీనివాసులు, విజయ్, శ్రీధర్ నిర్మించారు. గోపి సుందర్(Gopisundar)సంగీతాన్ని అందించాడు.

పరదా తొలి రోజు తెలుగులో ఫస్ట్ డే 12 లక్షల రూపాయలు, మలయాళంలో ఆరు లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్ సమస్య వల్ల మలయాళ వెర్షన్ లో టైంకి రిలీజ్ కాలేదు. దీంతో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తుంది. టోటల్ గా తెలుగు, మలయాళం లో కలుపుకుంటే 18 లక్షలు. గ్రాస్ ని యాడ్ చేస్తే, మరో రెండు లక్షలు చొప్పున 20 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఓవర్సీస్ లో చూసుకుంటే ఆరు వేల డాలర్లు రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా పరదా తక్కువ కలెక్షన్స్ రాబట్టడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పరదా చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ వినూత్నంగా ప్రచారం చేసారు. అనుమప పరమేశ్వరన్ కూడా పబ్లిసిటీ విషయంలో అంతా తానై వ్యవహరించింది. రివ్యూలు నచ్చితేనే సినిమాకి రండని కూడా చెప్పింది. మొదటి రోజు మూవీ చూసిన ప్రేక్షకులు మూవీ బాగుందనే చెప్తున్నారు. రివ్యూలు కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.