English | Telugu

ఆది పినిశెట్టికి భారీ ఆఫర్‌.. అతను తప్పుకోవడం వల్లే ఈ ఛాన్స్‌!

2006లో తేజ దర్శకత్వంలో దాసరి నారాయణరావు నిర్మించిన ‘ఒక ‘వి’చిత్రం’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆది పినిశెట్టి. ఆ తర్వాత తమిళ్‌లో చేసిన ‘మృగం’ ఆదికి చాలా మంచి పేరు తెచ్చింది. దాంతో తమిళ్‌లోనే ఎక్కువ సినిమాలు చేశాడు. తెలుగులో గుండెల్లో గోదారి, మలుపు సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు 10 సంవత్సరాలు కొనసాగిన కెరీర్‌లో ఆదికి మంచి బ్రేక్‌ రాలేదు. 2016లో అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రంలో పవర్‌ఫుల్‌ విలన్‌గా టర్న్‌ తీసుకున్నాడు. ఈ సినిమా అతనికి చాలా మంచి పేరు తెచ్చింది. ఇక అక్కడి నుంచి కొన్ని తెలుగు, తమిళ భాషల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆదికి ఒక భారీ ఆఫర్‌ వచ్చింది. కార్తీ హీరోగా తమిళ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మార్షల్‌’ చిత్రంలో ఆదికి విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. కార్తీ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌ కావడం విశేషం. వాస్తవానికి ఈ క్యారెక్టర్‌ కోసం మలయాళ నటుడు నివిన్‌ పాలిని తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్‌ డిఫరెంట్‌ గెటప్‌తో ఉంటాడు. నివిన్‌కి డిఫరెంట్‌గా మేకోవర్‌ చేసి విలన్‌గా పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడని కాన్ఫిడెన్స్‌ వచ్చిన తర్వాత అతనితో ఒక వీడియో చేసి రిలీజ్‌ చేశారు. చివరికి ఈ సినిమా స్టార్ట్‌ అయ్యే సమయానికి నివిన్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వకపోవడంతో అతన్ని తప్పించి ఆదిని తీసుకున్నారు. దర్శకుడు తమిళకు వెరీ టాలెంటెడ్‌ అనే పేరుంది. దర్శకుడిగానే కాకుండా నటుడుగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కార్తీ హీరోగా రూపొందుతున్న ‘మార్షల్‌’ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న తనకి ఈ సినిమా పెద్ద బ్రేక్‌ అవుతుందని నమ్ముతున్నాడు ఆది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.