English | Telugu

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్.. అటు 'OG', ఇటు 'PKSDT'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఓజీ' మొదటి షెడ్యూల్ ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ రెండో షెడ్యూల్ మొదలైంది.

ముంబైలో పవర్ ఫుల్ షెడ్యూల్ తర్వాత, 'ఓజీ' రెండవ షెడ్యూల్ ఈరోజు(మే 18) హైదరాబాద్‌లో ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బిగ్ స్క్రీన్ పై గ్యాంగ్ స్టర్ గా తమ అభిమాన హీరోని చూడటం కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ సైతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తుండటం వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా రవి కె.చంద్రన్ వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. 'ఓజీ'తో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'PKSDT'(వినోదయ సిత్తం రీమేక్) సినిమాలలో నటిస్తున్నాడు పవన్. ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదలై ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఈరోజు 'ఓజీ' రెండవ షెడ్యూల్ మొదలైంది. అలాగే ఈరోజు సాయంత్రం 'PKSDT' టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ కానున్నాయి. ఇలా వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాడు పవర్ స్టార్.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.