English | Telugu

ఘనంగా 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ అభిమానాలను ఫిదా చేసింది. సెప్టెంబర్ 19న ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో థర్డ్ సింగల్ కూడా విడుదల కానుంది. ఇలా వరుసగా అదిరిపోయే కంటెంట్ వదులుతూ.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న ఓజీ టీం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. (They Call Him OG)

'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నారు. దీని కోసం విజయవాడను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కి తెలుగునాట ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. పైగా ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటిది విజయవాడ వేదికగా 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే.. లక్షల్లో అభిమానులు తరలివచ్చే అవకాశముంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.