English | Telugu

ఎన్టీఆర్ అభిమానికి అండగా బెల్లంకొండ, మంచు మనోజ్!

సోషల్ మీడియా, అందునా ట్విట్టర్ అంటే మొదట గుర్తొచ్చేది ఫ్యాన్ వార్సే. అయితే ట్విట్టర్ ని సరిగ్గా వాడితే.. మనం ఇతరుల సాయం పొందడానికో లేక సాటి మనిషికి మనం సాయం చేయడానికో కూడా ఉపయోగపడుతుంది. తాజాగా ఓ ఎన్టీఆర్ అభిమాని తాను కష్టాల్లో ఉన్నానని ట్వీట్ చేయగా.. అతన్ని ఆదుకోవడానికి బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ముందుకొచ్చారు.

"ప్రస్తుతం నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాను. నా ఆరోగ్య సమస్యల వల్ల మొత్తం డబ్బు ఖర్చయిపోయింది. ఆర్థికంగా పూర్తిగా వెనకబడ్డాను. ఒక దశలో సూసైడ్ దాకా కూడా వెళ్లాను. కానీ నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం మళ్లీ బ్రతకాలని నిశ్చయించుకున్నాను. ఈ తీవ్ర పరిస్థితిలో చివరికి ఒక్క ఆశతో నా బాధను ట్విట్టర్ లో నా స్నేహితులు, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర ఫ్యాన్స్ తో పంచుకున్నా. కొంతమంది స్పందించి ఆర్థిక సహాయం అందించారు. ఇంకా సుమారు 2 లక్షల వరకు అవసరం ఉంది. దయచేసి, మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ఈ క్లిష్ట సమయంలో నాకు మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను." అంటూ సోమేశ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.

సోమేశ్ ట్వీట్ కి బెల్లంకొండ స్పదించాడు. మూవీ ప్రమోషన్స్ కోసం విజయవాడ వస్తున్నానని, నేరుగా కలిసి సాయం చేస్తానని చెప్పాడు. మరోవైపు మంచు మనోజ్ కూడా "నీ నంబర్ పంపు తమ్ముడు. ధైర్యంగా ఉండు. మేమంతా నీతో ఉన్నాం." అంటూ అతనికి ధైర్యం చెప్పాడు.

సోమేశ్ ట్వీట్ చూసి ఎన్టీఆర్ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా తమకు తోచిన సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కష్టాల్లో ఉన్నానంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ కి స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.