English | Telugu

ఓజీ మూవీ ఫస్ట్ రివ్యూ.. రెండు బిగ్ సర్ ప్రైజ్ లు!

సరిగ్గా వారం రోజుల్లో 'ఓజీ' తుఫాన్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ సెప్టెంబర్ 25న థియేటర్లో అడుగుపెట్టనుంది. ఇంతవరకు ట్రైలర్ విడుదల కాలేదు, భారీ ప్రమోషన్స్ కూడా లేవు. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అక్కడ సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఇక్కడ కూడా సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు రెట్టింపు చేసేలా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. (They Call Him OG)

తాజాగా 'ఓజీ' సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఓజీ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ని సుజీత్ చూపించిన తీరు అదిరిపోయిందట. పవన్ లుక్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంటున్నారు. ఇంట్రడక్షన్ సీన్ తోనే ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేయబోతున్నాడట సుజీత్. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్ అని చెబుతున్నారు. యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుందని టాక్. ఇక ఈ సినిమాలో రెండు బిగ్ సర్ ప్రైజ్ లు ఉన్నాయట. అవి థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ పంచడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే 'ఓజీ'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనే ఆసక్తి నెలకొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.