English | Telugu

దీపికకి మరో షాకిచ్చిన ప్రభాస్.. అసలేం జరిగింది..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన చిత్రం 'కల్కి 2898 AD'. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'కల్కి 2898 AD'కి సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సీక్వెల్ నుంచి కథకి కీలమైన సుమతి పాత్ర పోషించిన దీపికను తప్పించారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం. (Deepika Padukone)

"కల్కి 2898 AD సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. కల్కి లాంటి సినిమాకి నిబద్ధత మరియు మరెన్నో అవసరం. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము." అంటూ వైజయంతి మూవీస్ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఈ ప్రకటనలో "కల్కి లాంటి సినిమాకి నిబద్ధత అవసరం." అనే లైన్ హాట్ టాపిక్ గా మారింది. (Kalki 2)

నిజానికి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందనున్న 'స్పిరిట్'లో కూడా దీపిక హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ, దీపిక డిమాండ్స్ దారుణంగా ఉండటంతో ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని తీసుకున్నారు. మరి 'స్పిరిట్' ప్రభావమో లేక 'కల్కి 2' విషయంలో కూడా దీపిక డిమాండ్స్ అలాగే ఉన్నాయో కానీ.. ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ సినిమాల నుంచి దీపికను తొలగించడం సంచలనంగా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.