English | Telugu

ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రికార్డ్ సృష్టించింది

వెండితెర బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడిన కొన్ని చిత్రాలు బుల్లి తెరపై రికార్డులు సృష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరింది ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రభస. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించలేక బోల్తాపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని కైవ‌సం చేసుకున్న జెమిని టీవి వారు గత వారం బుల్లితెరపై ప్రదర్శిస్తే వూహించని విధంగా బుల్లితెర అభిమానులు దీనిని వీక్షించారట. దీంతో జెమిని టీవి ఏకంగా 14.5 రేటింగ్ తో మొదటి స్థానంలో నిలిచిందట. ఎన్టీఆర్ రభస దెబ్బకి నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రు పోగ్రాం, ఇటు ఈటీవీలో జ‌బ‌ర్‌ద‌స్త్ కార్యక్రమం వెనక్కి పడిపోయాయట. ఇదే స్పీడు మున్ముందూ కొన‌సాగితే జెమినికి ర‌భ‌స గిట్టుబాటు చేసిన‌ట్టే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.