English | Telugu

'టైగర్ 3'లో ఎన్టీఆర్ ఇంట్రో.. ఇదెక్కడి ఎలివేషన్ రా మావ!

'వార్ 2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'టైగర్ 3' తర్వాత రానున్న చిత్రమిది. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 లో ఎన్టీఆర్ అలరించనున్నాడు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో ఈ నందమూరి హీరో కనిపించనున్నాడు. అయితే 'టైగర్ 3'లోనే ఆ పాత్రని పరిచయం చేయనున్నారని, ఇందులో ఎన్టీఆర్ క్యామియో ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ప్రచారం జరిగినట్టుగా 'టైగర్ 3'లో ఎన్టీఆర్ క్యామియో అయితే లేదు కానీ, 'వార్ 2'లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చారు.

సల్మాన్ ఖాన్ లీడ్ రోల్ చేసిన 'టైగర్ 3' నేడు(నవంబర్ 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్ లో 'వార్ 2'కి లీడ్ ఇచ్చారు. కబీర్(హృతిక్)కి కల్నల్ లూథ్రా(అశుతోష్ రాణా) కాల్ చేసి ఎన్టీఆర్ పాత్రను డెవిల్ కంటే డేంజర్ అన్నట్టుగా పరిచయం చేశాడు. "ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఇండియాకి ఒక కొత్త శత్రుడు ఉన్నాడు. అతను అత్యంత ప్రమాదకరమైన వాడు. అతనికి పేరు లేదు, ముఖం లేదు.. చీకటిలో ఉంటాడు. అతన్ని అడ్డుకోవాలంటే నువ్వు కూడా ఆ చీకటిలోకి వెళ్ళాలి. మరణం కన్నా ప్రమాదకరమైన అతనితో పోరాడాలి. రాక్షసుడి లాంటి శత్రువుని ఎదుర్కొనే క్రమంలో నువ్వూ రాక్షసుడిలా మారిపోతావు" అంటూ లూథ్రా చెప్పుకొచ్చాడు. మొత్తానికి అతని మాటలను బట్టి చూస్తే.. 'వార్ 2'లో ఎన్టీఆర్ పాత్ర ఊహించిన దానికంటే ఎక్కువ పవర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే "ఇదెక్కడి ఎలివేషన్ రా మావ" అంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.