English | Telugu

మెగా సినిమాని పట్టించుకునే వారే లేరే!

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో నటించిన సినిమా. పైగా జోడిగా క్రేజీ హీరోయిన్ నటించింది. దానికి తోడు ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించింది. బడా బడా టెక్నీషియన్స్ పనిచేశారు. ఇలా ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఓ కొత్త సినిమాపై అసలు బజ్ లేదు. దానికి ప్రధాన కారణం ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ నవంబర్ 24 ప్రేక్షకుల ముందుకు రానుంది.

అసలు ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కావాల్సి ఉండగా, నవంబర్ 10కి వాయిదా వేశారు. మళ్ళీ క్రికెట్ వరల్డ్ కప్ అంటూ నవంబర్ 10 నుంచి నవంబర్ 24కి మార్చారు. ఇలా పలుసార్లు వాయిదా కారణంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందనే అభిప్రాయముంది.

మరోవైపు 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశ పరిచాడు. ఆ సినిమాల ఫలితం కూడా 'ఆదికేశవ'పై ప్రభావం చూపుతోంది అంటున్నారు. పైగా ప్రస్తుతం ప్రేక్షకులు విభిన్న తరహా చిత్రాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ కుర్ర హీరో పక్కా కమర్షియల్ సినిమాతో రావడం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆమె ఇమేజ్ కూడా సినిమాకి హైప్ తీసుకురావడంలేదు. 'ధమాకా' తరహాలో మాస్ ని ఆకట్టుకునే సాంగ్స్ లేకపోవడం కూడా మైనస్ అని చెప్పవచ్చు. మరి వీటన్నింటిని దాటుకొని విడుదల తర్వాత 'ఆదికేశవ' మూవీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

కాగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా డడ్లీ, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.