English | Telugu

చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. జై బాలయ్య..!

చరిత్రలో చాలా మంది ఉంటారు
చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే
మరోసారి గర్జించిన బాలయ్య

'వీరసింహారెడ్డి' వంటి ఘన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్.. బుధవారం హైదరాబాద్ లో ఘనంగా లాంచ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ ఒకటి వైరల్ గా మారింది.

బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు. పైగా హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో డైలాగ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకు శాంపిల్ అన్నట్టుగా ఓపెనింగ్ రోజే.. బాలయ్య ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.

"చరిత్రలో చాలా మంది ఉంటారు.. చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. అదే ఈ చరిత్ర.. నాదే ఆ చరిత్ర..." అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పై ముహూర్తపు షాట్ ని చిత్రీకరించారు. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: అఖండ-2 ఇంటర్వెల్.. ఏం హై రా బాబు...

'NBK111'లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రోల్ లో పవర్ ఫుల్ కింగ్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాణిగా నయనతార నటిస్తోంది.

కాగా, డిసెంబర్ 5న 'అఖండ-2'తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలకృష్ణ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.