English | Telugu

బిగ్ ట్విస్ట్.. 'NBK 108' టైటిల్ మారిందా!

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ 'భగవంత్ లాల్ కేసరి' అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారని, ఆ పాత్ర పేరునే సినిమాకి టైటిల్ గా నిర్ణయించారని ఇటీవల బలంగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా టైటిల్ అది కాదని, వేరే టైటిల్ ఉందని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా జూన్ 10న 'NBK 108' టైటిల్ ప్రకటన ఉంటుందని భావించారంతా. అయితే రెండు రోజుల ముందుగానే జూన్ 8 నే టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించి తాజాగా మూవీ టీం సర్ ప్రైజ్ చేసింది. దీంతో 'NBK 108' టైటిల్ గురించి చర్చ మొదలైంది. 'భగవంత్ లాల్ కేసరి' టైటిల్ ని ఖరారు చేశారని కొందరు అంటుంటగా, అంతకుమించి మరో పవర్ ఫుల్ టైటిల్ ఎంపిక చేశారని మరికొందరు అంటున్నారు. మరి 'NBK 108' టైటిల్ 'భగవంత్ లాల్ కేసరి'నేనా లేక మరేదైనా కొత్త టైటిలా? అనేది తెలియాలంటే గురువారం వరకు వేచి చూడాలి. కాగా టైటిల్ తో పాటు బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నారని సమాచారం.

మరోవైపు జూన్ 10న బాలకృష్ణ 109వ సినిమా ప్రకటన కూడా రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకుడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.